వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో మూడో (తుది) విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది. అప్పటికే క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ విడతలో 3,752 సర్పంచ్ పదవులకు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి తుది ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తారు.