బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలో బిచ్కుంద, మద్నూర్ పిట్లం, మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు తలపడ్డారు. మల్లయోధుల మధ్య కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి. చివరి కుస్తీలో తలపడిన వారు హోరాహోరీగా పోరాడి విజయం సాధించి 2500 రూపాయల నగదు బహుమతిని గెలుపొందారు. ఈ కార్యక్రమంలో బండయ్యప్ప మఠ సంస్థాన్ పీఠాధిపతి సోమయ్య అప్ప స్వామి మరియు వివిధ గ్రామస్తుల ప్రజలు పాల్గొన్నారు.