అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ
మంత్రి శ్రీధర్ బాబు
వెబ్ న్యూస్ బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్,బీజేపీ పార్టీల మధ్య ఫేవికాల్ బంధం మరోసారి నిరూపితమైందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యనించారు. అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందన్నారు. కాంగ్రెస్ ను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ తో కలిసిపోయిందని వ్యాఖ్యనించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీనేత, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పార్టీ పరంగా ఉన్న సంస్థాగత లోపాలను సవరించుకుంటామని చెప్పారు.