పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి

బతుకమ్మ బోధన్ : బోధన్ మండలం సాలూరా గ్రామంలో గణేష్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మచేందర్ రెడ్డి, విద్యుత్ ఏఈ కళ్యాణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ మండల నిర్వాహకులకు ఎస్ఐ మచేందర్ రెడ్డి సూచనలు చేస్తూ– ప్రతి గణేష్ మండలి నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి, రాత్రి 10 గంటల తర్వాత మైక్‌సెట్ ఆఫ్ చేయాలి, అలాగే డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. పండుగను శాంతియుతంగా, నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఆయన...