రాష్ట్ర స్థాయికి ఎంపికైన అమృతకు సన్మానం

  బాల్కొండ, బతుకమ్మ :   బాల్కొండ మండల మహిళా సమాఖ్య లో బి.అమృత ను సోమవారం ఘనంగా సన్మానించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయిలో మక్ పార్లమెంట్ లో పాల్గొని ప్రతిభ కనబరచి, రాష్ట్ర స్థాయికి ఎంపికైనందున రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరచినందున మండల మహిళా సమాఖ్య లో సన్మానం చేయటం జరిగిందని బాల్కొండ ఏపీఎం గంగారం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షురాళ్లు, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు.