Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2024, 8:01 pm Posted by : ramakrishna

ఎంఐఎం జిల్లా అధ్యక్షునిగా ఫయాజుద్దీన్ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ: ఎంఐఎం పార్టీ జిల్లా  అధ్యక్షులుగా  ఫయాజుద్దీన్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ  పార్టీ అధినేత  ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నియామక  పత్రాన్ని అందజేయనున్నారు.ఆదివారం  రాత్రి ఖిల్లా  రోడ్డులో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో ఫయాజ్ నియామకాన్ని అధికారికంగా  ప్రకటించనున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఫయాజ్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున వక్ఫబోర్డ్ చైర్మన్ గా పనిచేశారు . తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ లో చేరారు. గత నెలలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మజ్లీస్ పార్టీలో చేరారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు  యువకుడైన ఫయాజ్ కు నగర పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.

Fayazuddin was elected as MIM district president