కూతుళ్ళను హత్య చేసిన తండ్రి అరెస్టు

  కామారెడ్డి, బతుకమ్మ :   ముగ్గురు కూతుళ్ళను హత్య చేసిన తండ్రిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని బీఆర్ నగర్ కు చెందిన ఇస్మాయిల్ ఖాన్ తన ముగ్గురు కూతుళ్ళు మరియం, హయత్, సిఫత్ లను తన ఆటోలో తీసుకెళ్లి కామారెడ్డి పెద్ద చెరువులో తోసేసి హత్య చేశాడని తెలిపారు. కూతుళ్ళను పోశించడం చేతగాక కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె తెలిపారు....