భిక్కనూరు, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోమకొండ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన కొమ్ము మహేష్ (30) కృష్ణ మందిర్ దగ్గర లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.