ఆర్మూర్, బతుకమ్మ : ఆటో, బుల్లెట్ బైక్ ఢీకొన్న ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుంచి జానకంపేట్కు సుమారు ఆరుగురు వ్యక్తులతో ఆటో వెళ్తోంది. అలాగే నిజామాబాద్ నుంచి రాయల్ బుల్లెట్ బైక్పై ఆర్మూర్కు సాయికిరణ్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంకాపూర్ వద్ద ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జానంకపేట్ గ్రామానికి చెందిన సంధ్యారాణి, బైక్పై ప్రయాణిస్తున్న సాయికిరణ్ సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలాాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


సంధ్యా రాణి (ఫైల్)