Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 2:53 pm Posted by : ramakrishna

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతల పట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే  దుర్మరణం చెందారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.