యూరియా కోసం  సిరిసిల్ల రోడ్డు పై రైతుల ధర్నా

కామారెడ్డి, బతుకమ్మ :  జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు పైన గురువారం కామారెడ్డి  రైతులు ధర్నా  నిర్వహించారు.  భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరహరి పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.  అధికారులతో మాట్లాడి, రైతులకు సర్దిచెప్పి  ధర్నా విరమింప జేశారు.  రైతులు యూరియా కోసం టోకెన్స్ ఇవ్వాలని చెప్పడంతో అధికారులతో మాట్లాడి రైతులకు టోకెన్స్ ఇప్పించారు.