రైతులకు ఆందోళన అవసరం లేదు
నిజామాబాద్, బతుకమ్మ: యూరియా అంశంలో రైతులకు ఆందోళన అవసరములేదని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో గల ఖానాపూర్ లో యూరియా గోదాములను ఆయన, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్ర మంత్రులు, విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు....