Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 3:29 pm Posted by : ramakrishna

రైతు కష్టం నీటి పాలు

  • కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటలు
  • ఆందోళనలో రైతన్నలు

రుద్రూర్, బతుకమ్మ  : రాష్ట్రవాప్తంగా పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండు కుండలుగా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. అదేవిధంగా వరి పంటలు నీట మునగడంతో రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో భారడి పోచమ్మ గుడి వేనుకాల ఉన్న పార్వతి మురళికి చెందిన వరి పంట సుమారు 3 ఎకరాలు నీట మునిగిందని, రైతు కష్టం నీటి పాలయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రక్కన ఉన్న మిగతా పంట పొలాలు కూడా కురిసిన భారీ వర్షానికి నీట మునగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.