యూరియా కోసం రైతుల ఆందోళన
యూరియా కోసం రైతులు పడిగాపులు బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ సొసైటీ ముందర రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ 15 రోజుల నుండి యూరియా కోసం ప్రతిరోజు పడి కాపులు కాస్తున్నామన్నారు. జంగంపల్లి సొసైటీ 444 రాగా 800 మంది క్యూలో నిలబడ్డారు. వ్యవసాయ పనులు ఊపాందుకోవడంతో యూరియా అవసరం బాగా పెరిగింది అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి యూరియా ఇంకో 800 బ్యాగులు వస్తే రైతులకు కొరత ఉండదని భిక్కనూరు ఆర్ఐ బాలయ్య అన్నారు.