Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 1:14 pm Posted by : ramakrishna

భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనం

తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

నిజామాబాద్, బతుకమ్మ :  భూభారతి చట్టంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుందని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించబడిన భూభారతి రెవెన్యూ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశానుసారం రైతులందరికీ భూభారతి చట్టంపై  అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు.  కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ ఎమ్మార్వో విజయకుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.