వెబ్ న్యూస్, బతుకమ్మ : దుబాయి వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్ కి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయం సాధించాలని భారత్ లో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో, హరిద్వార్ లో పూజలు చేశారు. గంగానదికి హారతులు ఇచ్చి ప్రార్థనలు చేశారు. అలాగే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు,హోమం నిర్వహించారు.