Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2024, 11:03 am Posted by : ramakrishna

గుండెపోటుతో ప్రముఖ వైధ్యులు భీం సింగ్ మృతి

. . .  భీం సింగ్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

 . . . నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో సినీయర్ కంటి వైధ్య నిపుణులుగా పేరుగాంచిన  డాక్టర్ భీంసింగ్ కన్నుమూసారు. గత కోన్ని రోజులుగా ఆనారోగ్యంతో భాదపడుతున్న డాక్టర్ భీంసింగ్ (61) హైద్రాబాద్ లో ఓక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతుండగా గుండేపొటుతో మరణించారు. ఆయన గతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీ జీ ఎచ్) సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించారు. ఆప్తాలమిక్ వైద్యుడిగా నిజామాబాద్ ప్రజలకు సేవలందించి గత మే నెలలో పదవీ విరమణ చేశారు. ఆయన అంత్యక్రియలు  సొమవారం సాయంత్రం వరకు భీంసింగ్ స్వగ్రామం మాక్లూర్ తండాలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.