వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. స్థానిక గాంధీ బజార్ లో ఆదివారం బంగారం వ్యాపారి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భువనేశ్ ఆత్మహత్య చేసుకున్నారు.ఈనలుగురు వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.