వినయ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలి
ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ ఆర్మూర్, బతుకమ్మ : వినయ్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడిన తొమ్మిది నిమిషాల సంభాషణ.. తన వద్ద ఉందంటూ రాకేశ్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వినయ్ రెడ్డి జీవన్ రెడ్డితో 9 సెకండ్లు కూడా మాట్లాడలేదన్నారు. ఇరువురి సంభాషణ ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్...