లింగంపేట్, బతుకమ్మ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ధాన్యంతూకం సరిగా చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి విక్టర్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కోమటిపల్లి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
భూ భారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి
భూ భారతి సర్వే కు సంబంధించిన డెస్క్ వర్క్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. లింగంపేట్ మండలం పోతాయిపల్లి, నల్లమడుగు గ్రామాల్లో డెస్క్ వర్క్ లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
