Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2024, 3:48 pm Posted by : ramakrishna

సంగమేశ్వర్ ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణ

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగమేశ్వర్ మండలంలో గ్రూప్ రాజకీయాలను సృష్టిస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నాడని పార్టీ భవిష్యత్తుతో ఆడుకునేవారు ఎంతటి వారైనా పార్టీ క్షమించబోదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధరాస్ వార్ సాయిలు అన్నారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలను చేస్తూ కార్యకర్తలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించినందుకు గాను పార్టీ క్రమశిక్షణ చర్యల కింద సంగమేశ్వర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ధరస్ వార్ సాయిలు పత్రిక సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ బహిష్కరణకు గురైన వ్యక్తి గతంలో బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తిగా ఉంటూ గ్రూప్ రాజకీయాల ద్వారానే బహిష్కరణకు గురికావడం గమనార్హం. ఇకమీదట పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి నష్టం చేకూర్చే వ్యక్తులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే పార్టీ క్షమించబోదని ఇకమీదట ప్రతి కార్యకర్త పార్టీ కట్టుబాట్లకు అనుకూలంగానే ముసులుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తో పాటు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.