పేలిన ఫ్రిడ్జ్..

సనత్ నగర్ లో ఘటన హైదరాబాద్​,బతుకమ్మ :  హైదరాబాద్ లోని సనత్ నగర్ రాజరాజేశ్వరి నగర్ లో ఫ్రిడ్జ్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు వేశారు. అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.