బాధిత కుటుంబాలకు మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో శుక్రవారం పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల యాక్సిడెంట్ గురై గాయపడిన గ్రామ శాఖ అధ్యక్షులు పరమేష్ ను.ఈ మధ్యనే తండ్రిని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మహిపాల్ ను అలాగే నానమ్మ ని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.