ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలి

బతుకమ్మ,మోర్తాడ్: మహిళ సంఘాలలో నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు జనరల్ బాడీ సభ్యులంతా అంకితభావంతో పనిచేయాలని మహిళా సమైక్య  సీసీల జిల్లా అధ్యక్షుడు తడకల శ్రీనివాస్ అన్నారు. ఆయన సమక్షంలో మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల మహిళా సమైక్య కార్యవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షురాలిగా బొమ్మ నర్సు, కార్యదర్శిగా పూజిత, కోశాధికారిగా రాజ్యలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో వివో విజయ, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.