Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 8:10 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

అమ్మకు అక్షరం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఆర్డిఏ పి.డి సాయన్న అన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం అంకితభావంతో పని చేసిన వారికి శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో విజయవంతంగా చదువు నేర్పించి, పరీక్షలు రాయించి ఉత్తీర్ణత సాధించడానికి కృషిచేసిన అమీనాపూర్ అధ్యక్షురాలు గౌతమికి, వాలంటీర్ వనూషకి డిఆర్డిఏ పి.డి.సాయన్న చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడి మధుసూదన్, డిపిఎం నీలిమా, డిపిఎం వెంకటేశం, వేల్పూర్ మండల సమైఖ్యా అధ్యక్షురాలు సరోజిని తదితరులు పాల్గొన్నారు.

 

Everyone should work with dedication.