. . . టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహాత్మ జ్యోతిరావు పూలే మార్గనిర్దేశంను స్పూర్తిగా తీసుకొని సమాజ సమానత్వంకు అందరూ ప్రయత్నించాలని టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ వెల్లడించారు. జ్యోతిరావు పూలే 200వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా టిజిఓ సంఘం ఆధ్వర్యంలో శనివారం పూలే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుడైన పూలే జీవితాన్ని, ఆయన సమాజంలో తీసుకొచ్చిన మార్పులను, సంస్కరణలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీజిఓ కార్యదర్శి అమృత్ కుమార్, కోశాధికారి దేవీ సింగ్, అర్బన్ ప్రెసిడెంట్ దండు స్వామి, చందర్, టీజీవో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.