మోర్తాడ్, బతుకమ్మ: ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి దేవేందర్ అన్నారు. బుధవారం మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో వానమహోత్సవం కార్యక్రమం లో భాగంగా ఇంటింటా అవసరమైన జామ బొప్పాయి సీతాఫలం అల్ల నేరేడు పండు, మందార, గులాబీ తదితర మొక్కలను పంపిణి చేయడం జరిగింది. కార్యక్రమంలో అనిల్ నరేష్ రాజు పంచాయతీ కార్యదర్శి అరుణ్, కారోబార్ సాయన్న, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, రమేష్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.