. . . నందిపేట్ ఎస్సై కె.వినయ్ కుమార్
నందిపేట్, బతుకమ్మ :
డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరూ ఆంటి డ్రగ్స్ సోల్జర్ అవ్వాలని నందిపేట్ ఎస్సై కె.వినయ్ కుమార్ అన్నారు. నందిపేట్ మండల కేంద్రం లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొని చెడు అలవాట్లు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వలన కలిగే దుష్పరిణామాలు, శిక్షలు వివరించారు. అనంతరం విద్యార్థులతో, గ్రామస్తులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు.
