Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 7:28 pm Posted by : ramakrishna

ప్రతి ఉద్యోగి అంకితభావంతో పని చేయాలి

  • మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. నగర పాలక సంస్థ సిబ్బంది యొక్క అన్నీ ఏరియా లా శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటింటి చెత్త సేకరణ, కాలువలు శుభ్రపరచడం, రోడ్లు ఊడ్వడం లో అలసత్వం వహించరాదని సూచించారు. ప్రతి ఒక్కరు ఉద్యోగంలో అలసత్వం వహించరాదు అని హెచ్చరించారు. ఏటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జయ కుమార్, ఏఎంసి, సాజిద్ ఎస్ఎస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.

Every employee must work with dedication.