Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 4:32 pm Posted by : ramakrishna

నూతన వంతెన అంచనాలను సిద్ధం చేయాలి

 

. . . శ్రీనగర్ లో లో లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్…

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరంలోని వినాయక నగర్ నుంచి ఎల్లమ్మ గుట్టకు వెళ్లే దారిలో బాల హనుమాన్ ఆలయం పక్కన గల లో లెవెల్ వంతెనని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం వంతెన వద్ద నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు.

 

Estimates for the new bridge must be prepared.

 

అలాగే బ్రిడ్జి ఇరువైపులా రోడ్డు దెబ్బ తినడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, తక్షణమే చదును చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన వంతెన నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేసి ప్రపోజల్ పెట్టాలని సూచించారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Estimates for the new bridge must be prepared.