- జిల్లా మార్కెటింగ్ అధికార పి.రమ్య
కామారెడ్డి, బతుకమ్మ: వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్నూర్ జిల్లా కామారెడ్డి ఆధీనంలో 7 జీన్నింగ్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫికేషన్ వేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్ అధికారిని పి రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా సీసీఐ వారి ఎల్ 1, ప్రకారం ఒక మిల్లు కెపాసిటీ వరకు ఆ మిల్లు మాత్రమే కనబడుతుందన్నారు. అక్కడికి తీసుకొని వెళ్లవలసి ఉంటుందన్నారు. సీసీఐ ద్వారా పత్తిని అమ్మకమునకు తీసుకొని వచ్చే రైతులు, పత్తి యొక్క తేమ 8 శాతం నుంచి 12 శాతం నకు మించి ఉండరాదన్నారు. పత్తి యొక్క పింజ రకాన్ని బట్టి 50రూ. తేమ శాతాన్ని బట్టి 81, 82 రేటు తగ్గుతుందన్నారు.