ఏర్గట్ల నూతన ఎస్సై కి సన్మానం
బతుకమ్మ, ఏర్గట్ల : మండలానికి నూతనంగా నియమితులైన ఎస్సై పడాల రాజేశ్వర్ ను మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలతో సత్కరించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు బర్మ నరసయ్య, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, పార్టీ సీనియర్ నాయకులు బద్దం ప్రభాకర్, బద్దం హనుమాడ్లు,కొలిపాక శ్రీనివాస్ రెడ్డి, రోక్కెడ మోహన్ లు పాల్గొన్నారు.