ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని, కలితి విత్తనాలు అమ్మకం, ఫెర్టిలైజర్స్ అధిక ధరలకు అమ్మే షాపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఎరువులు విత్తనాల, సరఫరా, కల్తీ విత్తనాలు, మందుల అక్రమ అమ్మకం జరుగకుండా తీసుకోవలసిన చర్యలపై సమావేశం...