మెండోరా, బతుకమ్మ: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం అప్పటి హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్య ఇంజనీర్ నవాబ్ ఆలీ నవాజ్ జన్గ్ బహదూర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఉపకర్యనిర్వహక ఇంజనీర్ గణేష్ ఆధ్వర్యంలో నవాబ్ అలీ చిత్రపటం కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యనిర్వహక ఇంజనీర్ చక్రపాణి, ఉపకార్యనిర్వహక ఇంజనీర్లు, గంగా భూశాన్, రఘుపతి, శంకర్, సహాయ కార్యనిర్వహక ఇంజనీర్లు, కుమారి ఫిరదౌసి, జూనేద్, అఖ్తర్ ఉద్దిన్, సుశాంత్, శ్యామ్, రీక్కి సైమన్, అరవింద్, కొండవంశి, వీణ్యాస్, సూపర్డెంట్లు గోదావరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.