Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 7:33 pm Posted by : ramakrishna

ముగిసిన గ్రూప్ – 2 పరీక్షలు

. . . రెండో రోజు సగానికి సగమే హాజరు
నిజామాబాద్, బతుకమ్మ : గ్రూప్-2 పరీక్షలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. రెండవ రోజు సోమవారం 63 కేంద్రాలలో నిజామాబాద్ జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం సెషన్ లో 19855 మందికి గాను 8915 మంది హాజరు కాగా 10940 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 8911 మంది హాజరు కాగా 10944 మంది గైర్హాజరయ్యారు. కామారెడ్డి జిల్లాలోనూ రెండవ రోజు సగానికి సగం మాత్రమే హాజరైనట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.

Ended Group – 2 Exams