Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 7:10 pm Posted by : ramakrishna

ఉపాధి హామీ కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలి

 

. . . జాయింట్ కమిషనర్ శేషు కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి గ్రామంలో 100 శాతం ఉపాధి హామీ కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని జాయింట్ కమిషనర్ శేషు కుమార్ అన్నారు. నగరంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాబోయే రెండు నెలల కాలంలో చేపట్టాల్సి ఉన్న పనులు, కార్యక్రమాల గురించి దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ కూలీలకు వీలైనంత ఎక్కువగా పని దినాలు కల్పించాలని, మేట్లను నియమించి, వారికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమం క్రింద ప్రతి మండలానికి ఒక సిస్టం, ప్రింటర్ అందజేశారు.

 

Employment guarantee workers should be ensured to attend work.

 

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీ.డీ సాయన్న, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓ లు, ఈ.సీ లు పాల్గొన్నారు.

 

Employment guarantee workers should be ensured to attend work.