Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2024, 5:17 pm Posted by : ramakrishna

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగుల నిరసన

బతుకమ్మ, నిజామాబాద్ : వర్షాన్ని సైతం లెక్కచేయకుండ ఎంప్లాయిస్ జెఏసి నాయకులు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలిపారు. ఎంప్లాయిస్ జే ఏ సి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరం లోని కలెక్టరేట్ మైదానం లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జిల్లా చైర్మన్ అలుక కిసాన్ మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి ఐటీ సీలింగ్ రూ.10లక్షలకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొందిన ప్రతి ఉద్యోగికి పాత పెన్షన్ విధానం రద్దుచేసి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో సిపిఎస్ పెన్షన్ విధానం ఉద్యోగులకు గుదిబండగా మారిందని అన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది ఉద్యోగులు మరణిస్తున్నప్పటికీ సరైన వివిధ విధానాలు లేనందున వారికి ఎటువంటి పెన్షన్ రాక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని అన్నారు. సిపిఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని ఈ పోరాటం రోజురోజుకు ఉద్యమంలో మార్చి పాత పెన్షన్ విధానాన్ని అమలు అయ్యేవరకు ఉద్యమిస్తామని అన్నారు. త్వరలో ఒక స్టీరింగ్ కమిటీని వేసి దాని ద్వారా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంఘం అమృత్ కుమార్, హనుమంత రెడ్డి, టి జి ఆర్ ఈ ఎస్ ఏ కార్యదర్శి ప్రశాంత్, పిఆర్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాల నాయకులు, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్, టి పి టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి సల్ల సత్యనారాయణ, టీఎస్ జిఆర్ఈఏ అధ్యక్ష కార్యదర్శులు పండరినాథ్, భోజ గౌడ్, తీసి ఎన్జీవోఎస్ అధ్యక్షులు బాబురావు, డిటిఎఫ్ శాంతన్, టీఎస్ ఎంఈఎస్ఏ అధ్యక్షులు అన్వర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకుల స్వామి దాస్ పాల్గొన్నారు.