మహ కుంభ మెళాలో ఎల్లారెడ్డి వాసి మృతి

 ఎల్లారెడ్డి, బతుకమ్మ :  మహా కుంభ మేళాలో పుణ్య స్నానానికి వెళ్లిన ఎల్లారెడ్డి వాసి అక్కడ అస్వస్థతకు గురై మరణించారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి చెందిన మాజీ వార్డ్ మెంబర్ మంగళి శంకర్ (46 )  సోమవారం మహా కుంభమేళా లో అస్వస్థతకు గురికాగా లక్నో లోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.