బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న నిజామాబాద్ డిపో-2 ఎలక్ట్రిక్ బస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. నస్రుల్లాబాద్ మండలం నెమ్లీ శివారులో సాంకేతిక లోపంతో నిలిచిపోగా ప్రయాణికులు వేరే బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఎలక్ట్రిక్ బస్సులో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కూడా బాన్సువాడలో గంటసేపు బస్సు నిలిచిపోయిందని ప్రయాణికులు తెలిపారు.