మోర్తాడ్, బతుకమ్మ: గ్రామంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని మోర్తాడ్ ఎస్సై రాము అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు, సహజమని అందరు స్నేహపూర్వకంగా ఉండాలని తెలియజేశారు. సైబర్ క్రైమ్ గురించి సైతం అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో గ్రామభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంజాల నవీన్, సెక్రటరీ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్మా రంజిత్, గురిజాల నర్సారెడ్డి, బద్దం దేవేందర్, కమిటీ పెద్ద మనుషులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
