పెరిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో పెరిక సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బుద్దే ఎల్లప్ప, ఉపాధ్యక్షులుగా సురాజ్ శ్రీనివాస్, దుబాయ్ సాయిలు, ప్రధాన కార్యదర్శిగా ముద్దసాని రాజు, కన్నె ప్రవీణ్, కోశాధికారిగా ముద్దసాని చంద్రం, ఎంబరి గంగాసాగర్, గౌరవ అధ్యక్షులుగా సూరజ్ సాయిలు, కన్నే రవి, సహాయ కార్యదర్శిగా బుద్దే సాయిలు, లింగాల రాజు, బుద్దే రుక్మాజి, బుద్దే శంకర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు.