Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 6:42 pm Posted by : ramakrishna

కిరాణా వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

 రాజంపేట, బతుకమ్మ : రాజంపేట కిరాణా వర్తక సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం కార్యదర్శి బచ్చు శ్రీనివాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యవర్గాన్ని చుక్కాపూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం యందు ఎన్నుకున్నామని తెలిపారు. అధ్యక్షులుగా ములుగు చంద్రమౌళి గుప్తా, ఉపాధ్యక్షులుగా మొగిలిపల్లి రాజు, కార్యదర్శిగా బచ్చు శ్రీనివాస్ గుప్త, కోశాధికారిగా ముత్యపు వెంకట రాజేశ్వర్ గుప్తా, కార్యవర్గం సభ్యులుగా వలిపిశెట్టి ప్రవీణ్, బంధం పద్మారావు, బంధం అనిల్, నాయిని శ్రీనివాస్, బంధం నర్సింలు, కటకం రాజు, తొడంగల్ నర్సింలు, ఆముద సంకిత్లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ములుగు చంద్రమౌళి గుప్తా మాట్లాడుతూ  కిరాణా వర్తక సంఘ అభివృద్ధికి దోహదపడతానని తనకు అవకాశం ఇచ్చి మళ్లీ అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు.