Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 5:37 pm Posted by : ramakrishna

డిటిఎఫ్ ఆర్మూర్ మండల కార్యవర్గం ఎన్నిక 

ఇందూర్, బతుకమ్మ:  మండలంలోని  పిప్పి ప్రాథమిక పాఠశాలలో మండల కమిటీ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేసారు. అనంతరం డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆర్మూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పి. విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఏక్ నాథ్, ఉపాధ్యక్షులుగా అనసూయ, ఎం.చక్రధర్, కార్యదర్శిగా అంజాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏం. బాలయ్య, ఉపాధ్యక్షులు రాసరి పెంటన్న, పీ.దాసు పాల్గొన్నారు.