నవీపేట్, బతుకమ్మ:
పిడుగు శబ్ధానికి ఒ వృద్ధురాలు గుండే అగిపోయింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలో బుదవారం అలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం అర్ధరాత్రి నవిపేట్ మండలంలో భారీ వర్షం తోపాటు పడిన పిడుగు లు పడ్డాయి. నవిపేట్ మండలం లోని యంచ గ్రామంలో లక్ష్మీబాయి(67) అనే పిడుగు శబ్దానికి గుండెపోటు రావడంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే గ్రామంలో పిడుగుపాటుకు పలు ఇండ్లలో టీవీలు, ఫ్యాన్లు సహితం పాడయ్యాయని తెలిపారు.