Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2024, 6:55 pm Posted by : ramakrishna

వృద్ధురాలి ఆత్మహత్య.

బతుకమ్మ,నవీపేట్ : మండలం లోని అభంగపట్నం గ్రామానికి చెందిన సాయమ్మ (65) ఆదివారం నాడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అభంగపట్నం కు చెందిన లక్కీ సాయమ్మ కు ఇద్దరు కూతుర్లు పెళ్ళిలై వెళ్లిపోగా ఇంట్లో ఒంటరిగా ఉంటూ కూలీ చేసుకుంటూ ఉండేదని, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయమ్మ ఆదివారం ఉదయం వేకువజామున ఇంటి నుండి బయటకు వెళ్లిందని, ఇంటిముందు ఉండే వారు మృతురాలి కూతురుకు సమాచారం ఇవ్వగా కూతురు వచ్చి ఇంటి చుట్టుప్రక్కల, బంధువుల ఇంటిలో వెతికిందని తెలిపారు. సోమవారం ఉదయం గ్రామంలోని ఎర్రకుంట రిజర్వాయర్ లో పడివున్న మహిళ మృతదేహం ను సాయమ్మ డిగా గుర్తించగా, మృతురాలి కూతురు రెమ్మ స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించామని నవీపేట్ ఎస్సై కే.వినయ్ తెలిపారు.