నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ మండలంలోని ఖుదావన్పూర్ గ్రామంలో గల MPPS ఉర్దూ పాఠశాలలో సోమవారం ఈద్మీలాప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అన్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకకు నందిపేట్ ఎంఈఓ గంగాధర్, ఇతర అధికారులు, మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ జావేద్, వీడీసీ సభ్యులు, కాంగ్రెస్ యువజన నాయకుడు బైండ్ల ప్రశాంత్, గుండు హరీష్, బీజేపీ నాయకుడు నవీన్ హాజరయ్యారు.