Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 4:55 pm Posted by : ramakrishna

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

బతుకమ్మ బాన్సువాడ :  ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజీఈజేఏసీ) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్​ ను రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని, మేనిఫెస్టో లో పొందుపర్చిన విధంగా హామీలను అమలు చేయాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ కామారెడ్డి ఛైర్మన్ నరాల వెంకటరెడ్డి, సెక్రెటరీ జనరల్ దేవేందర్, కుశాల్, నాగరాజు, సాయిరెడ్డి, ఎల్లారెడ్డి, హన్మంత్ రెడ్డి, రాజు, చింతల లింగం, ముజీబొద్దీన్, దేవుల, విఠల్ రావు, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.