Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 4:59 pm Posted by : ramakrishna

కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మ దహనం

భీమ్ గల్, బతుకమ్మ : అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ ల డిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం దహనం చేశారు. ఈ సందర్బంగా కేటీయర్, జగదీశ్వర్ రెడ్డి లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం లోమండల పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ మండల అధ్యక్షులు కోరాడి రాజు,యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు,పల్లె శేఖర్,కౌన్సిలర్ సీఎచ్ గంగాధర్,మండల ఉపాధ్యక్షులు దొనకంటి కిషన్,సుంకరి సురేష్,వాకా మహేష్,సాయిబాబా,సంతోష్,శివ,మహేష్,సాగర్,నల్లూరి శ్రీను,రావుట్ల నవీన్,రాము,కుమార్,జిశాన్, నవీద్,నారాయణ,కిరణ్,రవి,భూమేష్,రహిమాన్,సైపాన్,రాజు తదితరులు పాల్గొన్నారు.