Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 12:00 pm Posted by : ramakrishna

26న ఎడపల్లి రైల్వే గేట్ మూసివేత

నిజామాబాద్, బతుకమ్మ : ఎడపల్లి- బోధన్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వేగేటును ఈనెల 26న ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 10గంటల వరకు మూసివేయనున్నట్లు నిజామాబాద్ సీనియర్ సెక్షన్ అధికారి తెలిపారు. రైల్వే ట్రాక్ పనుల నిమిత్తం రైల్వే గేటు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. బోధన్, నిజామాబాద్ వెళ్లే వాహనదారులు సాటాపూర్, ఏఆర్పీ క్యాంప్, అంబం(వై) దారి గుండా వెళ్లాలని అధికారులు సూచించారు.