వెబ్ న్యూస్, బతుకమ్మ : సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) ఆఫీసులో ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్కు చెందిన ఈడీ అధికారులు నంద్యాలలోని ఎస్డీపీఐ పార్టీ కార్యాలయాన్ని బలంవంతంగా తెరిపించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఈడీ అధికారులకు, ఎస్డీపీఐ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కార్యాలయం తలుపులు తెరిచి ఆఫీసులో అధికారులు సోదాలు చేస్తున్నారు.